మొన్న 20వతేదీ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన విషయం విదితమే...ఈ అల్పపీడనం బలపడి ప్రస్తుతం వాయుగుండంగా,తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యి ఉంది...వెదర్ మోడల్స్ ప్రకారం ఈ వాయుగుండం వచ్చే 48గంటల్లో తుఫాన్ గా బలపడి ,ఉత్తరదిశగా పయనిస్తూ,పశ్చిమబెంగాల్,బంగ్లాదేశ్ వైపు తీరందాటే అవకాశం ఉంది...
ఈ తుఫాన్ మనకు దూరంగా జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం మనపై శూన్యం.కాకపోతే ఈ తుఫాన్ వెళ్తూ,వెళ్తూ ఉత్తర భారతదేశం నుండి చలిగాలులను మనవైపుకు లాగుతుండటంతో, వచ్చే వారం రోజులు పగలు ఎండ,రాత్రుళ్ళు కనిష్ట ఉష్ణోగ్రతలు,పొగమంచు నమోదవుతాయి.వర్షాలు అతితక్కువగా ఉంటాయి... ఇక నైరుతి రుతుపవనాల తిరోగమనం నిన్నటితో ఉత్తరాంధ్ర,తూర్పుగోదావరిలోని కొన్ని భాగాల నుండి నిష్క్రమించాయి.
No comments:
Post a Comment