Monday, October 31, 2022

Weather Update 31/10/2022

నాలుగు రోజుల క్రిందట నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరియు ఈశాన్య రుతుపవనాల రాక గురించి చెప్పటం జరిగింది. అనుకున్నట్టుగానే ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరియు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి...ప్రస్తుతం తమిళనాడు,తిరుపతి జిల్లా తీరాల సమీపంలో గాలుల సంగమం ఏర్పడింది కాబట్టి ఈరోజు ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి...

ఇక ఏర్పడిన అల్పపీడనం వల్ల వచ్చే 2-3రోజులు రేపల్లె డివిజన్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి...సముద్రతీర మండలాలైన నిజాంపట్నం,రేపల్లె,నాగాయలంక,కోడూరు మండలాలు ,గాలుల సంగమానికి(Wind convergence zone)దగ్గర్లో ఉన్నాయి కాబట్టి వర్షాలు కొంచెం ఎక్కువ ఉండె అవకాశం ఉంది.* 

No comments:

Post a Comment